బ్రెయిన్ ట్యూమర్‌తో బాలిక మృతి

02-05-2024 01:34:52 AM

చొప్పదండి, మే 1 : గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బాలిక వేసవి సెలవుల్లో ఆనందంగా గడిపేందుకు ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన జక్కుల బాబు(శ్రీనివాస్), రజిత దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ముగ్గురు సంతానంలో పెద్దదైన శ్రీలక్ష్మిచింతకుంటలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల్లో ఇటీవల ఇంటికి వచ్చింది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న శ్రీలక్ష్మి మంగళవారం అకస్మాత్తుగా వాంతులు, విరేచనాలతో అప స్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యు లు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం పూర్తిగా విషమించిందని, మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి వైద్య సేవలు అందించారు. కాగా శ్రీలక్ష్మిబ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు అక్క డి వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది.