ఖమ్మం, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కమ్యూనిస్టులు బలపర్చిన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘు రాం రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న టీస్టాల్కి వెళ్లి టీ మరిగించి తన వెంట వచ్చిన కాంగ్రెస్ నాయకులకు అందించారు. అక్కడే కార్యకర్తలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ప్రచారాన్ని కొనసాగించారు. అలాగే ఉదయం సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్, షటిల్ ఆడారు. వాకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాసేవ కోసమే పోటీచేస్తున్నానని, మద్దతిచ్చి గెలిపిస్తే అందరికీ అండగా నిలుస్తానని అభయమిచ్చారు.