10-06-2025 06:40:02 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ(SFI Telangana State Committee) సభ్యునిగా, మహబూబ్ నగర్ లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికైనట్టు ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గంధసిరి జ్యోతిబసు(SFI District President Gandhasiri Jyoti Basu) తెలిపారు. 2019 నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యల గురించి అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ ప్రభుత్వాలు అనేక కేసులు, నిర్బంధాలు పెట్టినా విద్యార్థులకు నాణ్యమైన, శాస్త్రీయ విద్యా విధానం అందాలని విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడానికి సహకరించిన ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తు విద్యార్థి పోరాటంలో మరింత కీలకంగా పనిచేస్తానని ‘అధ్యయనం - పోరాటం' నినాదంతో చదువుతూ, చదువుకై పోరాడనున్నట్లు ప్రకటించారు.