12-05-2025 01:27:13 AM
నిజామాబాద్, మే 11( విజయ క్రాంతి): ఎప్సెట్ ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థలు విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. అనాస్ అలి 1766, ఎం శ్రీకాంత్ 2398, జీ వేదాక్షర్ 2881, భవ్య శ్రీ 3310, ఎం లోకేష్ 3671, ఏ వైష్ణవి 4172, జీ రిషిక్ 5932, వీ నికేతన్ 6293 ర్యాంకులు సాధించారని సంస్థ చైర్ పర్సన్ సీ హెచ్ విజయ లక్ష్మి తెలిపారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్ పర్సన్ తోపాటు డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్ అభినందించారు.