17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కల్యాణలక్ష్మిఆడబిడ్డలకు వరం

21-05-2025 12:56 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు

నిజాంపేట(రామాయంపేట), మే 20: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పేదింటి ఆడపడుచులకు వరంలాంటిదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పేర్కొన్నారు. మంగళవారం నిజాంపేట మండల కేంద్రంలో కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులు, మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళలు, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, సీఎం రేవంత్రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలకు గృహజ్యోతి, రూ.500 గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట, నిజాంపేట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.