15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

దేశానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ

21-05-2025 02:11 PM

ముత్తారంలో వర్ధంతి వేడుకల్లో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ

ముత్తారం, (విజయక్రాంతి): దేశానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి(Rajiv Gandhi death anniversary) సందర్భంగా మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళర్పించారు. ఈ సందర్భంగా దొడ్డ బాలాజీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్యలు మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ భారతదేశానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన మహా నాయకుడని,18 ఏండ్లు వచ్చిన వారికి ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేశారని ఆయన కొనియాడారు, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన పునాదులే కారణమని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏలువాక కొమురయ్య, డైరెక్టర్లుట లింగారావు, అలగం పాపయ్య, ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్కం ప్రభాకర్, ఆకోజ్ అశోక్, పింగిలి రవీందర్ రెడ్డి, కుక్కల చందు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు.