12 March, 2026 | 6:12 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

కమనీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం

02-11-2024 02:43 AM

నల్లగొండ, నవంబర్ 1 (విజయక్రాంతి): దామరచర్ల మండలం వాడపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి నక్షత్రం సందర్భంగా 726 ఏండ్ల తరువాత వేద పండితులు ఆలయ ప్రాంగణంలో కనుల పండువగా కల్యాణం జరిపించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి పీటలపై కూర్చోబెట్టారు.

వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల నడుమ కమనీయంగా కల్యాణం జరిపించారు. ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భక్తులకు అన్నదానం చేశారు.