21-06-2025 12:53:42 AM
అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపం
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం
కామారెడ్డి , జూన్ 20 (విజయ క్రాంతి): కామారెడ్డి కంపు కొడుతుంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న పాలనపై పట్టింపు లేని ధోరణి నీ అధికారులు అవలంబిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ కు ప్రయాణం కోసం వివిధ జిల్లాలకు చెందిన ప్రయాణికులు వస్తున్న బస్టాండ్ బయటకు వెళ్తే రోడ్డుపై నడిస్తే ముక్కు మూసుకోవాల్సి వస్తుంది.
పారిశుధ్యం పై అధికారుల పట్టింపు లేనితనం కోట్టొచ్చినట్టుగా కనబడుతుంది. గతంలో పాలకమండలిలు ఉన్న సమయంలో స్థానిక ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమ సమస్యలను విన్నవించేవారు. పారిశుద్ధ్య సమస్య వచ్చిన, నీటి సమస్య వచ్చిన ప్రజా ప్రతినిధుల కు వివరించేవారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. స్థానికంగా ఉన్న అధికారులకు అదనపు బాధ్యతలు ఇతర మున్సిపాలిటీలో అప్పగించారు.
దీంతో కామారెడ్డి పట్టణంలో సమస్యలపై అధికారులు పట్టుకున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కామారెడ్డి పట్టణం హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న పట్టణం. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత కామారెడ్డి మున్సిపాలిటీ లో పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు పెరిగిపోయాయి. అలాగే వివిధ అక్రమ కట్టడాలు, నిర్మాణాలతో కామారెడ్డి సిటీని తలిపిస్తుంది.
అయితే కామారెడ్డి గతంలో 33 వార్డులతో ఉన్న మున్సిపాలిటీ ని 49 వ వార్డులుగా పరిధి పెంచారు. దాదాపు పట్టణంలో లక్ష కు పైగా జనాభాతో నగరం గా మారానుంది. కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలను కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనం చేశారు. మున్సిపాలిటీ పరిధి పెరగడంతో కామారెడ్డి అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నప్పటికీ కామారెడ్డిలో ప్రస్తుతం సమస్యలు అస్తవ్యస్తంగా మారాయి.
పట్టించుకునే అధికారుల నిర్లక్ష్యం పెరిగిపోయింది. దీంతో ఆయా కాలనీ లలో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. కాగా మున్సిపాలిటీల పాలకవర్గం జనవరి చివరితో ముగిసింది. దాదాపు ఆరు నెలలు పూర్తి అవుతుంది. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు శ్రద్ద కూడా తక్కువైంది. దీంతో కామారెడ్డి పట్టణం అస్తవ్యస్తంగా మారి వెక్కరించినట్లు చేస్తుంది.
కంపు కొడుతున్న కాలనీలు...!
కామారెడ్డి మున్సిపాలిటీ లోని 49 వార్డులు ఉండగా ప్రత్యేకాధికారులను వార్డులకు నియమించారు. అయినప్పటికీ సమస్యలు మాత్రం తప్పడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. తమ సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చిన్న చినుకులు కురిస్తేనే .. చిత్తడిగా మారుతోంది. కాలనీలన్నీ జలమయం అవుతున్నాయి.
దీంతో డ్రైనేజీలు ఎక్కడికక్కడ నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుం దని పేర్కొంటున్నారు. అలాగే ఆయా కాలనీలో తీవ్రమైన తాగునీటి సమస్య తలెత్తు తుంది. ఇదిలా ఉంటే విలీన గ్రామాలు అయిన ఏడు గ్రామాల కాలనీల పరిస్థితి అగ మ్య గోచరంగా ఉందని పేర్కొంటున్నారు. వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు కాలనీల వై పు కన్నెత్తి చూడకపోవడంతో కూడా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.
గాడి తప్పిన పాలన...!
కామారెడ్డి మున్సిపాలిటీ పాలన పూర్తిగా గాడి తప్పుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు నామ మాత్రంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పన్నుల వసూళ్లు పకడ్బందీగా నిర్వహించే అధికారులు కాలనీలో సమస్యలను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలనీల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు పట్టణ ప్రణాళిక విభాగంలోనూ పని చేసే టీపీవో, టీపీఎస్ అదికారులకు ఇన్ ఛార్జిగా అదనపు బాద్యతలు ఇవ్వడంతో కూడా సామాన్యుల పట్టణ వాసుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. సమస్యలన్నీ కుప్పలుగా పేరుకుపోతున్నాయి.
అదికారులకు ఇన్ ఛార్జి బాద్యతలు
కామారెడ్డి పట్టణ ప్రధాన విభాగం పట్డణ ప్రణాళిక విభాగం పట్టణంలో నిర్మాణాలు, అనుమతులకు సంబందించిన అనేక ముఖ్యమైన వాటికి వీరు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆ అధికారులు మాత్రం పట్టణంలో జరుగుతున్న నిర్మాణాలు, అనుమతులపై దృష్టి సారించలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి టీపీవోగా పని చేస్తున్న గిరిదర్ కామారెడ్డి టీపీవోతో పాటు దుబ్బాక మున్సిపాలిటీ కి ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
అలాగే టీపీవో కావ్య కూడా హైదరాబాద్ లోని బోడుప్పల్ మున్సిపాలిటీ కి ఇన్ ఛార్జి గా విధులు నిర్వహిస్తున్నారు. టీపీవో గిరిధర్ మూడు రోజులు కామారెడ్డిలో... మరో మూడు రోజులు దుబ్బాకలో బాద్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే టీపీఎస్ గా కామారెడ్డిలో కొనసాగుతున్న కావ్య ఇక్కడ మూడు రోజులు, మరో మూడు రోజులు బోడుప్పల్ లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణ ప్రణాళిక విభాగంలో అంతులేని అవినీతి పేరుకుపోతుందని వాపోతున్నారు.
కాగా నిర్మాణాలకు సంబందించిన అనుమతులు, అక్రమ నిర్మాణాలపై పూర్తి స్థాయిలో పట్టు కోల్పోయింది. దీంతో ఇదే అదునుగా చూసుకొని కొందరు అక్రమ నిర్మాణాలు అనుమతులు లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రెవెన్యూ శాఖలో సైతం సరైన దృష్టి సారించకపోవడంతో పట్టణానికి పన్నుల రూపంలో రావాల్సిన వివిద పన్నుల వసూలు కావడం లేదు. ఇదిలా ఉంటే సామాన్యులకు మరో పక్క వివిధ సమస్యలపై కార్యాలయానికి వెళ్లినా అక్కడ ఏ అధికారి పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.
పట్టణంపై తప్పుతున్న పట్టు..
కామారెడ్డి పట్టణంలో నిర్మాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు పెరిగిపోతున్న అధికారుల పర్యవేక్షణ లోపంతో పట్టు కోల్పోతుంది. పట్టణం లో కనీస సౌకర్యాలు, అభివృద్ధి విషయాలను గమనించాల్సిన అధికారులు అటు వైపు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసినట్లు ఉంటున్నాయి. అయితే అధికారులందరినీ సమన్వయం చేస్తూ పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు మెండుగా విన్పిస్తున్నాయి.
ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం కాకుంటే మరింత ఇబ్బందులు తప్పేలా లేవు. అయినా కామారెడ్డి మున్సిపాలిటీ పై పట్టు కోల్పోవడంతో పాటు సమస్యలు తీయకుండా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబందిత ఇన్ ఛార్జి అధికారితో పాటు కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉంది. లేకుంటే కామారెడ్డి పట్టణం మరింత అద్వానంగా మారే అవకాశం ఉంది.
ప్రజలు సమస్యలు విన్నవిస్తే పరిష్కరిస్తున్నాం
కామారెడ్డి జ్లి కేంద్రంలో సమస్యలున్న మాట వాస్తవమే. పనిచేస్తున్న అధికారులకు ఇతర మున్సిపాలిటీలో పనిచేసేందుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పర్యవేక్షణ అందుకే కోర వడింది. ప్రజలు మున్సిపాలిటీకి వచ్చి సమస్యలు విన్నవిస్తే పరిష్కరిస్తున్నాం.
- రాజేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి.