15 April, 2026 | 12:29 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రపంచానికి మనమిచ్చిన గొప్ప బహుమతి యోగా

21-06-2025 12:49 AM
  1. దీనికి 200 దేశాలు గుర్తింపు
  2. కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి 
  3. ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా యోగా దినోత్సవ కౌంట్‌డౌన్

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక మనదేశం ప్రపంచానికిచ్చిన అద్భుత బహుమతి యోగా అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యా ప్తంగా 200 దేశాలు యోగాను గుర్తించి, ఆచరిస్తున్నారని తెలిపారు. ఇది ప్రతీ భారతీయు డు గర్వించదగిన విషయమన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఎల్బీ స్టేడియంలో 24 గంటల కౌంట్‌డౌన్ కార్యక్రమం సందర్భంగా కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ నేత ఖుష్బూ, సినీనటులు సాయిదుర్గ తేజ్, తేజ సజ్జ, మీనాక్షి చౌదరి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

భాగ్యనగర్ వాసులు పెద్దఎత్తున తరలొచ్చి యోగాసనాలు వేశారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అన్ని ప్రాంతాల్లో వేడుకగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో 5 లక్షలమందితో కలిసి యోగాలో పాల్గొనటం సంతోషకర విషయమన్నారు.

యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుందని.. కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటాయన్నారు. యోగానే మనకు ప్రథమ డాక్టర్ అని... సర్వరోగ నివారిణి అని తెలిపారు. యోగా పాటించినట్లయితే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయని.. అందుకే యోగాను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరుతున్నామన్నారు.