calender_icon.png 21 June, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికంలో సత్తా చాటాలి!

21-06-2025 01:17:31 AM

  1. వార్డు నుంచి జడ్పీపీఠం వరకు.. అన్నీ కైవసం చేసుకోవాలి
  2. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై రాష్ట్ర సర్కారుకు చిత్తశుద్ధి లేదు
  3. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి నాటకాలు
  4. స్థానిక సంస్థల ఎన్నికలపై వర్క్‌షాప్‌లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): గ్రామాల్లో వార్డుల నుంచి జిల్లాలో జడ్పీ చైర్మన్ పదవి వరకు అన్ని స్థానిక సంస్థల్లోనూ బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలని, ఆ విధం గా పార్టీ నేతలంతా స్థానిక సంస్థ ల ఎన్నికలకు సిద్ధం కావాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల వర్క్‌షాప్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కమిటీలు, జిల్లా కమిటీల నుంచి వచ్చిన నూతన నాయకత్వం రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ర్టంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. రాష్ర్ట వ్యాప్తం గా మండలాల వారీగా, జిల్లాల వారీగా పార్టీ వర్క్‌షాప్‌లు నిర్వహించుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో యువత నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి కొత్త నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు.

నరేంద్రమోదీ నాయకత్వంలోనే తెలంగాణకు సరైన దిశలో పరిష్కారాలు లభిస్తాయని, లేకపోతే తెలంగాణను రక్షించడం సాధ్యం కాదని ప్రజలే చెబుతున్నారన్నారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి అప్పుపుట్టడం లేదం టూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని.. ఇది గత బీఆర్‌ఎస్, ప్రస్తుత ప్రభుత్వం పాపమేనని అన్నారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల చేత గానితనం, అసమర్థత కారణంగానే రాష్ర్టం అ ప్పులపాలైందని ఆరోపించారు. రాష్ట్ర అభివృ ద్ధి కోసం కేంద్రప్రభుత్వం అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రైల్వేలు, విద్యారంగం, జాతీయరహదారులు, ఆరోగ్యరంగం, గ్రామాల్లో అభివృద్ధి.. ఇలా అన్ని రంగాల్లో కేం ద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే తెలంగాణలో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగదన్నారు. 

దృష్టి మళ్లింపు రాజకీయాలు..

రాష్ర్టంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ అంశాలను తెరపైకి తీసుకొస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుచేసేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ర్టంలో ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైందని..బీజేపీ ఆఫీసులో పనిచేసే సిబ్బంది, నాయకులు, సోషల్ మీడియా టీం ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి నాటకాలాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు బీజేపీని అడ్డుకునేలా కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారని.. అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ర్టం అప్పుల పాలై, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు.

25న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం

ఈనెల 25వ తేదీన ఎమర్జెన్సీ వ్యతిరేక ది నంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కిషన్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ గతంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన విధానం, ప్రజాస్వామ్యాన్ని నిర్వీ ర్యం చేసిన తీరును ప్రజలకు వివరించాలన్నా రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతూ తామే రక్షకులమంటూ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల వర్క్‌షాప్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజ యం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తోంది. అందులో భాగంగా శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు సునీల్ బన్సల్, అభయ్‌పాటిల్, చంద్ర శేఖర్ తివారీ, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, బీజేపీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.