06-08-2024 12:04:28 PM
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో కొనసాగుతున్న సీబీఐ కేసుకు సంబంధించిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. న్యాయమూర్తి కావేరీ బవేజా మునుపటి విచారణ సమయంలో కవిత తరపు న్యాయవాదులు గైర్హాజరు కావడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ విచారణను వాయిదా వేశారు.
దీంతో జడ్జి బవేజా వాదనలకు రాకపోతే పిటిషన్ను ఉపసంహరించుకోవాలని వ్యాఖ్యానించారు. రేపటికి కేసును వాయిదా వేస్తూ కోర్టు తుది విచారణకు కొత్త తేదీని నిర్ణయించింది. రేపు విచారణ జరుగనున్న నేపథ్యంలో త్వరితగతిన స్పందించిన కవిత తరఫు న్యాయవాదులు ఈరోజు పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ ఊహించని చర్య హై-ప్రొఫైల్ కేసులో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. సీబీఐ చార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని జూలై 6వ తేదీన న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. చార్జీ షీట్లో తప్పులేవి లేవని సీబీఐ వెల్లడించింది. ఇప్పటికే సీబీఐ చర్జ్ షీట్ ను జూలై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుపై ఆగస్టు 9న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.