12 June, 2026 | 2:25 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ఉమ్రా యాత్రికుల మృతి పట్ల కేసీఆర్ సంతాపం

17-11-2025 02:49 PM

హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు(Saudi bus crash) ప్రమాదంలో పలువురు తెలంగాణ వాసులు మృతి చెందడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యి అందులో ప్రయాణిస్తున్న 45 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్ వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.