ఓటింగ్ శాతం పెంచాలి

01-05-2024 12:34:35 AM

హనుమకొండ, ఏప్రిల్ 30(విజయక్రాం తి): పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్ కోరారు. జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఆధ్వర్యం లో ఓటరు అవగాహనపై రూపొందించిన కరపత్రాలను మంగళవారం కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. నగరంలో వంద శాతం ఓటింగ్ జరిగేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో ఠాకూర్ రతన్ సింగ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావు, శివాజీ, కాళిదాసు పాల్గొన్నారు.