calender_icon.png 14 November, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాట్రిక్ కొట్టిన కేరళ

20-12-2024 12:00:00 AM

మేఘాలయకు తొలి గెలుపు సంతోష్ ట్రోఫీ

హైదరాబాద్: దేశవాలీ టోర్నీ సంతోష్ ట్రోఫీలో భాగంగా కేరళ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ వేదికగా గ్రూప్ తొలి మ్యాచ్‌లో కేరళ 2 ఒడిశాపై గెలుపును నమోదు చేసుకుంది. కేరళ తరఫున ముహమ్మద్ అసల్ (ఆట 41వ నిమిషం), నసీబ్ రహమాన్ (54వ ని.లో) గోల్స్ సాధించారు. ఈ ఓటమితో ఒడిశా కేవలం ఒక విజయంతో నాలుగో స్థానానికి పడిపోయింది. టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న కేరళ తొమ్మిది పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇక మేఘాలయా టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మేఘాలయా 2 గెలుపొందింది. మేఘాలయా తరఫున డొనాల్డ్ డీంగో డబుల్ గోల్స్‌తో మెరిశాడు. సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి కాగా పట్టికలో రెండో స్థానంలో ఉంది.