11 May, 2026 | 12:59 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

కోహ్లీ, స్మిత్ కీలకం

21-08-2024 11:34 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై స్పందించిన మాజీ ఆసీస్ ప్లేయర్

ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇద్దరూ రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తమ ముద్ర వేస్తారని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు. సీయట్ క్రికెట్ రేటింగ్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హేడెన్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ, స్మిత్ ఇద్దరూ బీసీజీలో కీలకం అవుతారు. వారిద్దరూ ప్రతి విషయాన్ని కొత్త మార్గంలో చేసి చూపిస్తారు.

ఇద్దరి స్టుల్ ఇతరులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది.’ అని హేడెన్ అన్నాడు. ఇండియా మధ్య చాలా కాలం నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. ఈ సంవత్సరం పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ మొదలు కానుంది. చివరగా 2014 సంవత్సరంలో ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. తర్వాత నాలుగు పర్యాయాలు ఇండియానే విజయం సాధించింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది.