26-07-2025 03:33:22 PM
తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని పాలకోయ తండా నివాసి మున్నూరు కాపు కులస్తుడు కోల అంజన్ రావు కుమారుడు కోలా సాయి చరణ్ 18 సంవత్సరాలు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న విషయాన్ని సంఘ సభ్యులు తోట రామకృష్ణ తెలంగాణ మున్నూరుకాపు పటేల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కాంపెల్లి కనకేష్ పటేల్ తమ మున్నూరు కాపు సంఘం యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇట్టి విషయాన్ని తెలియ పరచగా గ్రూపు సభ్యులు 64 మంది స్పందించి తమ వంతుగా రూ.72,816/- విరాళాలు అందించారు. ఇట్టి డబ్బులను శనివారం సంఘ సభ్యులు అంజన్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఇప్పుడు అంజన్ రావు కుటుంబానికి సహాయం చేసినట్లుగానే గతంలో జగన్నాధపురం గ్రామానికి చెందిన శ్రావణపు పెద్దులు కుటుంబానికి రూ.46203/- సోములగూడెం గ్రామానికి చెందిన పెద్దనీటి అనసూర్య కుటుంబానికి రూ.69000/- తమ సంఘ సభ్యుల ద్వారా విరాళాలు సేకరించి అందించడం జరిగిందన్నారు. మున్నూరు కాపు కులస్తులకు ఏమైనా సహాయం అవసరమైతే తెలియపరచగానే సంఘంలోని సభ్యులు స్పందించిన తీరు అద్భుతం అని, విరాళాలు అందించిన మున్నూరు కాపు సోదర, సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.