10-06-2025 12:00:00 AM
కోలీవుడ్లో హీరోగా ఎంతో క్రేజ్ను సంపాదించుకున్నారు రవిమోహన్. ఇన్నేళ్లు నటుడిగా అందరినీ మెప్పించిన రవి మోహన్ ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. ‘డిక్కిలూ నా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన కార్తీక్ యోగి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.
నలుగురు ప్రముఖ మహిళా నటులతోపాటు ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించనున్నారు. పోర్ తోజిల్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కలైసెల్వన్ శివాజీ, యానిమల్, అర్జున్ రెడ్డి వంటి విజయాలను అందించిన హర్షవర్ధన్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయనున్నారు. ఎడిటర్గా ప్రదీప్ ఇ. రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్గా ఎ. రాజేశ్ వ్యవహరించనున్నారు.
స్లాప్ స్టిక్ కామెడీ అంశాలతో కూడిన వినోదాత్మక ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని నటుడు రవిమోహన్ స్వయంగా రవిమోహన్ స్టూడియోస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు కార్తీక్ యోగి మాట్లాడుతూ.. ‘నేను రవిమోహన్కి కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఈ కథను పూర్తిగా ఆస్వాదించారు. కథ విన్న వెంటనే దానిని నిర్మించడానికి ముందుకు వచ్చారు.
ఈ చిత్రంలో స్లాప్ స్టిక్ హాస్యం అధికంగా ఉంటుంది‘ అన్నారు. నలుగురు ప్రముఖ మహిళా నటీనటుల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. రవిమోహన్ ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’, గణేశ్ కే బాబు డైరెక్ట్ చేస్తున్న ‘కరాటే బాబు’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.