calender_icon.png 6 June, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వంతోనే ప్రతి ఒక్కరికీ న్యాయం...

31-05-2025 12:01:22 AM

అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హనుమకొండ, మే 30 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని  అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్ లోని తమ నివాసంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు హనుమకొండలోని తమ నివాసానికి చేరుకొని సమస్యలు మంత్రికి విన్నవించారు.

ప్రతి సమస్య వింటూ, పరిష్కారం చూపుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదల సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులు గా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.