చేవెళ్లలో బీజేపీ గెలుపు తథ్యం

29-04-2024 01:31:57 AM

బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 

రాజేంద్రనగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : ప్రధాని నరేంద్రమోదీ దేశాభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీఠ వేసి పాలన కొనసాగింస్తుందని, ఈ ఎన్నికల్లో తిరిగి బీజేపీని గెలిపిస్తే దేశం అభివృద్ధిలో మరింత దూసుకుపోతున్నదని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.