మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. ఆదివారం ఘణపురం మండల కేంద్రం లో స్థానిక నాయకులతో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో జరిగిన నిజమైన అభివృద్ధికి.. కాం గ్రెస్ ప్రభుత్వ వంద రోజుల మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ రాష్ట్రాన్ని కన్నబిడ్డలా చూసుకున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిం చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.