26-09-2025 10:43:37 AM
తాండూరు,(విజయక్రాంతి): గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా ఏకైక మధ్యతరహా సాగునీటి కోటిపల్లి ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. దీంతో అలుగు పై నుండి ప్రమాదకర స్థాయిలో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుంది. ధరూరు , నాగసమందర్ మధ్య రాకపోకలు నిలిచిపోయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు గంటల తరబడి వేచి చూస్తున్నారు.