క్రిశాంక్కు బెయిల్ మంజూరు
11-05-2024 01:38 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (విజయక్రాంతి): బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించిన నకిలీ సర్క్యులర్ ఫార్వర్డ్ చేసిన కేసులో మన్నె క్రిశాంక్ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న క్రిశాంక్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు షూరిటీలు సమర్పించాలని, ప్రతిరోజూ పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించింది.






