14 July, 2026 | 3:23 PM

Breaking News

పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •  

కృష్ణమ్మ పరవళ్లు

27-06-2025 12:10 AM

గద్వాల/నాగర్‌కర్నూల్, విజయక్రాంతి: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి వరద భారీ గా వస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో గంట గంటకు పెరుగుతున్నది. గురువారం రాత్రి 9 గంటల కు అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారంగా నారాయణపుర నుంచి 98 వేల క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 74,052 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్‌కు 27,384 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్‌కు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 315 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 550 క్యూసె క్కులు, కుడి కాలువ ద్వారా 290 క్యూసెక్కులు వదు లుతున్నారు.

జూరాల నుంచి శ్రీశైలానికి 96,621 క్యూసెక్కుల జలాలు వచ్చి చేరుతున్నాయి. 885 అడు గులు, 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 863.16 అడుగులకు చేరుకొని 115.9856 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది.