నేడు నిర్మల్కు కేటీఆర్
09-05-2024 12:39 AM
ఆదిలాబాద్, మే 8 (విజయక్రాంతి): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మల్ జిల్లాలో గురువారం పర్యటించనున్నట్టు ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న బుధవారం తెలిపారు. సాయంత్రం 4 గంటలకు భైంసా రోడ్షోలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు నిర్మల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొంటారని చెప్పారు.




