17-05-2025 12:40:48 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. శనివారం హరీశ్ రావు నివాసంలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, పాతూరి సుధాకర్ పాల్గొన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు, వివిధ అశాలపై సమాలోచనలు చేశారు.