5 March, 2026 | 5:20 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

మహిళలకు ఉచిత బస్సు.. పురుషులకు డబుల్ టికెట్ల రేట్లు

09-10-2025 12:03 PM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్కార్ నడుపుతుందో, సర్కస్ నడుపుతుందో వాళ్ళకే అర్ధం కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కి బస్ భవన్ కు ప్రయాణిస్తుండగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ఉదయం హౌస్ అరెస్ట్ చేయడానికి 50 మంది పోలీసులు ఇంటికి వచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాం వెళ్ళాలి అంటే వెళ్ళండి అన్నారని చెప్పినట్లు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను, కార్పొరేటర్లను అరెస్ట్ చేసి కొంత మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొంత మందిని తిరిగి పంపించారని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవాళ "చలో బస్ భవన్" కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ పురుషులకు టికెట్ల రేట్లు డబుల్ చేయడం, బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదా? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.