10 April, 2026 | 5:23 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

గ్రూప్-1 విషయంలో అడుగడుగునా తప్పులే: కవిత

09-10-2025 01:26 PM

గ్రూప్-1 నియామకాల్లో అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం

విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు

హైదరాబాద్: తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) ఆధ్వర్యంలో గ్రూప్-1 నియామకాల్లో అవకతవకల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం(Roundtable meeting ) నిర్వహించారు. గ్రూప్-1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడికి కార్యక్రమాలు చేపడతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వెల్లడించారు. 15 వ డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 15 వరకు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు కవిత సూచించారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపేందుకు రౌండ్ టేబుల్ భేటీ ఏర్పాట చేశామని వెల్లడించారు. గ్రూప్-1 విషయంలో అడుగడుగునా తప్పులు జరిగాయని కవిత ఆరోపించారు. ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడతారని భావిస్తున్నామని కవిత అన్నారు. రౌండ్ టేబుల్ భేటీ తీర్మానాన్ని గవర్నర్, సీఎంకు పంపిస్తామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులకు జాగృతి భరోసా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు.