14-01-2026 01:18:09 AM
వానకాలం పంట కొనుగోళ్లలో రికార్డు
32.45 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ర్టం రికార్డు సృష్టించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సివిల్ సప్లుసై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. 2025 ఖరీఫ్ (వానకాలం) సీజన్లో రాష్ర్ట ప్రభుత్వం ముందెన్నడూ లేని రీతిలో 70.82 లక్షల టన్నులను కొనుగోలు చేసిందని వారు చెప్పారు. గతంలో కొనుగోలు చెసిన 70.2 లక్షల టన్నుల రికార్డ్ను ఈ ఖరీఫ్ సీజన్ అధిగమించిందని తెలిపారు.
ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకమని, 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని వివరించారు. తెలంగాణా రాష్ర్టంలో సాధించిన దిగుబడికి గాను రాష్ర్ట వ్యాప్తంగా 13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించమాన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మొత్తానికి రూ.16,912 కోట్లు పైచిలుకని, ఇందులో ఇప్పటికి రూ.16,602 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చారిత్రక మైలురాయిగా మంత్రి ఉత్తమ్ అభివర్ణించారు. ఈ రికార్డుల్లో రాష్ర్ట పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖలు సమన్వయం చేయడంతో పాటు తెలంగాణ రైతాంగం భాగస్వామ్యం ఉందని మంగళవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలకు అద్దం పడుతుందని ఉత్తమ్ పేర్కొన్నారు.
సవాల్గా ధాన్యం కొనుగోళ్లు
రాష్ర్టంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రావడంతో కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వం సవాల్గా స్వీకరించి 8,448 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి ఉత్తమ్ చెప్పారు. సన్నాలకు రూ. 500 బోనస్ను ఇప్పటి వరకు రూ.1,425 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినం జరుపుకుంటున్న రైతా ంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.