11-10-2025 01:11:05 AM
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం డిమాండ్
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 10: బెల్లంపల్లిలో సింగరేణి భూములు అమ్ముకొని కోట్లు గడిస్తున్న నాయకులు తమ అక్రమాలను వెంటనే ఆపాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నీరటి రాజన్న, వర్కింగ్ ప్రసిడెంట్ సమ్ము రాజయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు జైపాల్ సింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సౌత్ క్రాస్ కట్ గని కబ్జా స్థలాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబ్జాలను సింగరేణి అధికారులు, సింగరేణి సెక్యూరిటీ విభాగం సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లనే స్థలంను ఆక్రమించేస్తున్నారని పేర్కొన్నారు.
భూకబ్జాలను అడ్డుకున్న రాత్రికిరాత్రే దేవుళ్ళ పేరిట గద్దెలు నిర్మించి భూ ఆక్రమణలకు తెరలేపారని, ప్రభుత్వ ఆస్తులను కాపాడల్సిన శాసన సభ్యులు అక్రమాదారులకు అండగా నిలువడం సరి యైనది కాదని, సింగరేణి ఖాలి స్థలాలను ఆక్రమించకముందే ఇండ్లు లేని పేద ప్రజలకు, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, కార్మిక సంఘాల ఆఫీస్ నిర్వహణకు కేటాయించాలని సింగరేణి అధికారులను, ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గొడిసెల శ్రీహరి, ఎల్తూరి శంకర్, సదానందం, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.