9 April, 2026 | 10:22 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

లంక జోరు.. ఒమన్ బేజారు

13-02-2026 12:50 AM

కొలంబో, ఫిబ్రవరి 12 : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గ్రూప్-బీలో భాగం గా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక పూర్తి ఆధి పత్యం చెలాయించగా.. ఒమన్ తేలిపోయింది. కనీస పోటీ కూడా పోటీనివ్వలేక పోయింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. అనంతరం ఒమ న్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 ప రుగు చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో  మొహమ్మద్ నదీం  మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు. ఈ విజయంతో గ్రూప్ -బీ నుంచి సూపర్ -8 అవకాశాలను మెరుగుపర్చుకోగా.. ఒమన్ వరుస ఓటముల తో ఇంటిదారి పట్టేందుకు రెడీ అయింది.