18 April, 2026 | 12:37 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

రేషన్ పంపిణీ వంద శాతం పూర్తి చేయాలి

20-06-2025 02:07 PM

రేషన్ పంపిణీ వంద శాతం పూర్తి చేయాలి. 

- కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): రేషన్ పంపిణీ నిబంధనల మేరకు 100 శాతం సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badavath Santosh) రేషన్ డీలర్లను ఆదేశించారు. శుక్రవారం బిజినపల్లి మండలం(Bijinapalle Mandal) వెలుగొండ గ్రామంలోని రేషన్ షాప్‌ను సందర్శించి సన్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నాణ్యతతో కూడిన సన్న బియ్యం పంపిణీ చేస్తుందని లబ్ధిదారులు దళారుల మాటలు నమ్మి ఎవరు కూడా బియ్యం అక్రమార్కులకు అమ్ముకోవద్దన్నారు.  ప్రతి లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున మూడు నెలల సన్న బియ్యం పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 65.69% పంపిణీ పూర్తైందని, 1.6 లక్షల మంది లబ్ధిదారులకు బియ్యం అందించామన్నారు. ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కొనసాగుతుందనీ, ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు.