22 June, 2026 | 2:05 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •  

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన కుమ్మరి సంఘం నాయకులు

10-11-2025 12:00 AM

మణుగూరు,(విజయక్రాంతి) : కుమ్మరులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండల కు మ్మర సంఘం నేతలు ఎమ్మెల్యేను ఆదివారం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.

అనంతరం మాట్లాడు తూ.. కుమ్మరులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాల కృషి చేస్తున్నారన్నారు. కుమ్మరులకు ప్రభు త్వ పథకాలతో న్యాయం చేస్తామన్నారు. సం ఘం నాయకులు పలు సమస్యలను ఎమ్మె ల్యే దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని, ఎమ్మెల్యే హామీనిచ్చారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరికొండ వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు బాడిస శంకర్ రావు, నిదానపల్లి బాలకృష్ణ, నిమ్మనగోటి బిక్షపతి, కార్తీక్, గణేష్, గురుప్రసాదు తదితరులు పాల్గొన్నారు.