2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

సంగోజిపేట్ శివారులో చిరుత కళేబరం

15-03-2026 01:08 AM

గోర్లు దంతాలను పట్టుకెళ్లిన దుండగులు

బాన్సువాడ మండలంలో ఘటన

నిజామాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): బాన్సువాడ మండలంలోని సంగోజి పేట్ శివారులో గల అటవీ ప్రాంత రాజన్న గుట్ట వద్ద చిరుత పులి కళేబరం కనిపించడంతో ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అందరూ అడవి జంతువుల వేటగా ళ్లు పులి గోర్లు కోసమే చిరుతను వధించి ఉం టారని ఇది గుర్తుతెలియని దుండగులు ఇచ్చిన పని అని సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. చిరుతను చంపి చిరుత గోళ్లను దొంగిలించి నట్లు అటవిశాఖ అధికారులు అంచనాకొచ్చారు.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధి కారులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలను సేకరించారు. పులికి సంబంధించి న గోర్లు పండ్లను చిరుతను చంపిన దుండగు లు దొంగలించినట్టు తెలుస్తోంది.కామారెడ్డి జిల్లా అధికారిని నికిత, బాన్సువాడ ఫారెస్ట్ అధికారి హబీబ్, తదితరులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ఇద్దరు అనుమాతుని తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు, చిరుత మృతి విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.