calender_icon.png 24 June, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం

24-06-2025 12:40:35 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజ యక్రాంతి)/అదిలాబాద్: డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిధమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, బీజేపీ సీనియర్ నాయకులు, వన్ నేషన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కా ర్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్ర ప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి ఆశయాలను ఆలోచనలను అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పరిచేందుకు బీజేపీ ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. రాజకీయ సామాజిక న్యాయం కోసం దేశాన్ని విభజించే అవసరం గానీ, నాయకత్వం వహించాలనుకే వర్గాన్ని అవమానించే అవసరం గానీ లేదని శ్యాం ముఖర్జీ చెప్పారని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆశయ సాధనకోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ప్రసాద్ గౌడ్, శ్రీకాంత్, మాటూరి జయరాజ్, సదాశివ తదితరులు పాల్గొన్నారు

అదిలాబాద్‌లో 

శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశానికి ఎన్నో సేవలు చేశారని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. సోమవారం ఉట్నూరు మండల కేంద్రంలో జరిగిన జన సంఘ్ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని, వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ... ముఖర్జీ దేశానికి అందించిన సేవలు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అలాగే ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. నాడు జన సంఘ్ ను స్థాపించి ప్రస్తుత బీజేపీ పార్టీ అభివృద్ధికి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు మారువలేనివి అన్నారు.   ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, బీజేపీ పార్టీ నాయకులు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.