24-06-2025 12:39:22 AM
ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్, జూన్ ౨౩ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం విషయం లో ఖానాపూర్ ప్రాంత ప్రజలు అవాస్తవాలను నమ్మొద్దని, కొంతమంది పని కట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ అన్నా రు. ఇటీవల ఈ పాఠశాల నిర్మాణం విష యం ఖానాపూర్ నియోజకవర్గం లో తీవ్ర గందరగోళం పరిస్థితులు నెలకొన్న నేపథ్యం లో సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివరణ ఇచ్చారు. నిజానికి గత ప్రభుత్వాలు ఖానాపూర్ పట్టణం కొమరం భీమ్ చౌరస్తాలో 110 ఎకరాలు స్థల సేకరణ చేశామని చెప్పినప్పటికీ అంత మొత్తం సేకరించలేదని దానిలో కేవలం 76.20 గుంట లు మాత్రమే స్థల సేకరణ జరిగినట్లు రికార్డులు పరిశీలించామని అన్నారు. ఈ స్థలం లో వివిధ శాఖలకు, సంఘాలకు, స్థలం కేటాయింపులు జరగగ అక్కడ స్థలం లేదని అధికారులు తెలిపిన మేరకే, రెండవ విడతలో ఈ పాఠశాల మంజూరు చేపించామ ని, ప్రస్తుతం నాలుగు మండలాల్లో స్థలం లేకపోవడం వల్లనే నిర్మాణం ఉట్నూర్లో చేయదలచామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
కాగా ఈ పాఠశాల మంజూరు విషయంలో ముందుగా స్థలం ఉంటేనే ప్రభుత్వం మం జూరు చేస్తుందని, కాగా ఇదివరకే అక్కడ ఉన్న స్థలం అన్ని శాఖల కేటాయించడంతో అక్కడ స్థలం లేదని, 110 ఎకరాలు అనేది అబద్ధమని ఆయన చెప్పుకొచ్చారు .ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, తనకు ఖానాపూర్ అభివృద్ధి విషయంలో ఎటువంటి వివక్ష లేదన్నారు. తనకు నియోజక వర్గం అభివృద్ధి ప్రధానమని ఆయన అన్నా రు.
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు విషయంలో అపోహలు నమ్మొద్దు, నిజమైన లబ్ధిదారులకు కచ్చితంగా ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. 110 ఎకరాల్లో స్థల సేకరణ అవకాశం ఏమైనా ఉంటే కచ్చితంగా అధికారులతో సర్వే చేపిస్తానని అభివృద్ధి విషయంలో తాను కచ్చితంగా ఉంటాను అని ఆయన చెప్పారు .ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూమన్న, వైస్ చైర్మన్ మాజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజుర సత్యం,
అంకం రాజేందర్ ,పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణాధ్యక్షులు నిమ్మల రమేష్, యూసఫ్ ఖాన్ ,మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ తోట సత్యం, గంగ నరసయ్య, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ పాషా, నాయకులు వెంకటప్పయ్య, మదిరఘ సత్యనారాయణ, శ్రీనివాస్, నేత శ్యామ్, నబి ఖాన్, పెద్దులు, తదితరులు ఉన్నారు.