3 July, 2026 | 10:21 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

మట్టి విగ్రహాలనే ప్రోత్సహిద్దాం

19-08-2025 12:00 AM

వినాయకుడి ప్రతిమ తయారు చేయడం నుంచి పూజించడం, నిమజ్జనం చేయడం దాకా అంతా ప్రకృతి కేంద్రంగా జరుగుతుంది. సంప్రదాయ పూజ పద్ధతిలో ‘రీసైకిల్’ అనే ఒక పర్యావరణ నియమం మనకు స్పష్టంగా కనబడుతుంది. కానీ, ప్రస్తుతం సమాజంలో వినాయక చవితి పండుగ జరుపుకొనే వి ధానం పర్యావరణ విధ్వంసం కలిగించే విధంగా ఉంటుంది. మ ట్టితో తయారుచేసిన ప్రతిమలకు బదులుగా ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్’ అనే విష రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించ డం ఆనవాయితీగా మారిపోయింది.

ఈ పద్ధతిని విడనాడి రా బోయే వినాయక చవితికి మట్టి విగ్రహాలనే ప్రోత్సహిద్దాం. ప్ర తిఏటా రాజకీయ నాయకులు మట్టి విగ్రహాలనే పెట్టాలని పలికే మాటలు కేవలం ప్రచారానికే తప్ప ఆచరలో అది ఎంత మాత్రం సాధ్యం కావడం లేదు. ఈసారైనా అధిక సంఖ్యలో మట్టి వి గ్రహాలను ఏర్పాటు చేసి గణనాథుడికి పూజలు చేయాలి. అందుకే నీటిలో కరిగే  మట్టి విగ్రహాలనే పూజిస్తూ ముందుకు సాగుదాం.

 లక్ష్మీనారాయణ, కరీంనగర్