calender_icon.png 30 June, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప కారవేతనాలకు దూరమవుతున్న మైనారిటీ విద్యార్థులు

30-06-2025 12:00:00 AM

మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా

కొత్తగూడెం జూన్ 29 (విజయక్రాంతి)అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఉన్న త విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దూర మవుతు న్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారి టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యా కూబ్ పాషా ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉపకారవేతనాలు పొందేం దుకు దరఖాస్తు చేసుకోవడానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ 1.50 లక్షలు పట్ట ణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు రూ 2 లక్ష ల ఆదాయ పరిమితి గతంలో ఉండేదని, 20 22 లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మాదిరిగా గ్రామీ ణ ప్రాంతాల్లోని మైనారిటీ విద్యార్థులకు కూడా పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆదాయ పరిమితిని రూ 2 లక్షలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగిందని,

అయినప్పటికీ ఈ-పాస్ పోర్టర్ లో విద్యార్థులు ఉప కారవేతనాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేట ప్పుడు రూ 1.50 లక్షల ఆదాయ పరిమితి ఉన్న వారికి ఆన్లైన్ స్వీకరించడం లేదని అ న్నారు. అధికారులు వెంటనే స్పందించి జరిగిన పొరపాటును సరి దిద్దుకొని రూ 1.50 లక్షలు ఉన్న ఆదాయ పరిమితిని అర్హులుగా ప్రకటిస్తూ వెంటనే ఈ-పాస్ పోర్టల్ లో మార్పులు చేసి గడువు తేదీని 10 రోజులు పొడిగించాలనికోరారు.