1 July, 2026 | 11:39 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

దివ్యాంగులను ఆదరిద్దాం

03-12-2025 05:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): దివ్యాంగులను సమాజం ఆదరించాలని, వారిని ఎప్పుడు కూడా చిన్నచూపు చూడొద్దని, వారిని జనజీవన స్రవంతిలో కలుపుకోవాలని, వారిలోని శక్తియుక్తులను, సృజనాత్మకతలను సమాజం వాడుకోవాలని మండల విద్యాధికారి తోడిశెట్టి పరమేశ్వర్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక విలీన భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులైన పిల్లలకు ప్రభుత్వం ద్వారా లభించనున్న వివిధ రకాల పథకాలను అవకాశాలను రిజర్వేషన్లను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పిల్లలకు వివిధ పాటల పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్, ఎంపిఓ జ్యోతి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు త్రివేణి, విలీన భవిత కేంద్రం ఇన్స్ట్రక్టర్ సంధ్య రాణి పోషకులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.