ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా లింగాల భూపాల్ ఎన్నిక
23-03-2026 03:34 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. అధ్యక్షుడిగా లింగాల భూపాల్ (నమస్తే తెలంగాణ), ఉపాద్యకులుగా కుంటోళ్ల యాదగిరి (మన తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా కొండా శ్రీనివాస్ రెడ్డి (సాక్షి), సంయుక్త కార్యదర్శిగా సల్లూరి నర్సింగ్ రావు (ప్రజాపక్షం), కోశాధికారిగా లంబ రాజుయాదవ్ (సూర్య) లు ఎన్నిక కాగా సలహాదారులుగా మేడబోయిన నర్సింహ్మా (వార్త), ఫొతేధార్ రామకృష్ణ (ఈనాడు), మేకల పద్మారావు (విశాలాంధ్ర)లను నియమించారు. ఎన్నిక అథారిటీగా వేముల గోవింద్ రాజ్, కె. శ్రీనివాస్ రెడ్డి లు వ్యవహరించారు. ఈసందర్భంగా నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు.




