06-08-2025 08:43:22 PM
మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలం కిష్టారావుపేట గ్రామానికి చెందిన సింగనేని శ్రీనివాస్ కు రూ.2,50,000 ల ఎల్ఓసి మంజూరు చేశారు. శ్రీనివాస్ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఆపరేషన్ కొరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తెలుపగా వెంటనే స్పందించిన మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.2,50,000 ల ఎల్ఓసిని వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి పిఏ హైదరాబాదులోని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.