14-06-2025 11:27:09 PM
మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు..
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువాతో సన్మానించి తన పట్ల ఉన్న నమ్మకంతో టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల్లో పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను తీసుకువెళ్లి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా కష్టపడి పని చేస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడు చురుకైన పాత్ర పోషిస్తున్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఈ పదవి లభించడం పట్ల కామారెడ్డి పట్టణంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నట్లు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. తన కోరిక మేరకు సీఎం సానుకూలంగా స్పందించడం జరిగిందని చెప్పారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను తీసుకువెళ్లి అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు నిర్మాణం జరిగే విధంగా కృషి చేస్తారని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందే విధంగా తన శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని విజయ క్రాంతి ప్రతినిధితో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.