చిట్యాల నూతన తహసీల్దార్గా ఎం.విజయ్ కుమార్
06-04-2026 08:24 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల నూతన తహసిల్దార్ గా ఎం. విజయ్ కుమార్ సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వ బదిలీపై చిట్యాల మండలానికి తహసిల్దార్ గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన నూతన తహసీల్దార్కు చిట్యాల డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, సిబ్బంది సమన్వయంతో మండల అభివృద్ధికి సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని నూతన తహసీల్దార్కు శుభాకాంక్షలు తెలియజేశారు.




