22-01-2026 03:53:43 PM
తాండూరు, 22 జనవరి, (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ నూతన కమిషనర్ గా మధుసూదన్ రెడ్డి గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన యాదగిరి బదిలీ కావడంతో ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన మధుసూదన్ రెడ్డి విధుల్లో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి రాజకీయ పార్టీల నాయకులు, యువకులు ,మహిళలు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు