17 April, 2026 | 9:43 PM

Breaking News

అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •  

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే

11-04-2025 07:26 PM

బీసీ ఉద్యమ నాయకుడు చుంచు రాజ్ కిరణ్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే అని బీసీ ఉద్యమ నాయకుడు చుంచు రాజ్ కిరణ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఐబి వద్ద బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యమ నాయకుడు చుంచు రాజు కిరణ్ మాట్లాడుతూ.... ప్రతి మహిళ చదువు కోవాలని, మహిళల చదువు తో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆకాంక్షతో మొట్ట మొదటి సారిగా తన భార్య సావిత్రి భాయి పులేకు విద్యను నేర్పించి మొదటి గురువుగా తీర్చి దిద్దిన మహానుభావుడని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల తీన్మార్ మల్లన్న టీం మహేష్ వర్మ, జిల్లా కార్యదర్శి దాస్యపు దీపక్, బీసీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కళ్యాణ రవి, బీసీ నాయకులు బండి రాజలింగు, పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు వేముల రాజగురువయ్య, మాలం చిన్నయ్య, మందపల్లి తిరుపతి, కాని గర్మ అశోక్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దోండ ప్రభాకర్, శంకర్, బండారి శంకరన్న, బియ్యాల దినేష్, దేవ రాజేందర్, పవన్, సాయి, తదితరులు పాల్గొన్నారు.