calender_icon.png 27 June, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశన్న మాట తీరేవేరు!

27-06-2025 01:10:10 AM

  1. పెద్దన్న పాత్ర కోసం పీసీసీ చీఫ్ ఆరాటం 
  2. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో ఎలా చెప్తారని మండిపాటు
  3. ఇప్పటివరకు స్పందించని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి 
  4. తర్వాతి సీఎం బీసీనే అవుతారని పీసీసీ చీఫ్ నమ్మకం 
  5. మరో ఐదేళ్లు కూడా తానే సీఎం అంటున్న రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మృదుస్వభావి.. పరుష పదజాలానికి దూరంగా ఉంటారు. పాతతరం నాయకుల తరహాలో చెప్పాల్సిన అంశాలను సూ టిగా చెప్పడంలోనూ దిట్ట. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందని బాహాటంగానే ప్రకటించడం ఆయన నైజం. పార్టీలో ఎన్నో డక్కీ మొక్కీలు ఎదుర్కొని.. పీసీసీ పీఠంపై కూర్చుకున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ అంటేనే కులాల  కుంపట్లు..  వర్గ పోరు.. నాయకుల మధ్య సమన్వయలోపం.. ఒక మాటలో చెప్పాలంటే ఎవరికివారే యము నా తీరే. ఇలాంటి పరిస్థితుల్లో పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్ గౌడ్  తన పెద్దరికాన్ని కాపాడుకునేందుకు ఆరాటపడుతుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నే నోటిఫికేషన్ వస్తుందని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను.. ప్రతిపక్షాలు వివాదం చేసేందుకు ప్రయత్నం చేశాయి.

పీసీసీ చీఫ్ వెంటనే జోక్యం చేసుకొని మంత్రి పొంగులేటికి కాల్ చేసి సీరియస్ అయినట్లుగా ప్రచారం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పార్టీ నిర్ణ యం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోకి నెట్టి.. బీజే పీని బద్నాం చేయాలనే ప్రయత్నంలో కాం గ్రెస్ పార్టీ ఉంది.

బీసీ రిజర్వేషన్ల అంశం ఎ టూ  తేలకుండానే .. ఎలా మాట్లాడుతారని మంత్రి పొంగులేటిపై మహేష్‌కుమార్ గౌడ్ చేసి సీరియస్ అయినట్లుగా బయటికి లీక్‌లు ఇచ్చినా.. మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి మహేష్‌కుమార్ గౌడ్  ఫోనే  చేయనప్పుడు సీరియస్ ఎలా అవుతారనే  సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది.

పార్టీకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా పీసీసీ చీఫ్ ముందుగానే స్పందించారనే  పార్టీ నాయకులు చెబుతున్నారు. మ హేష్‌కుమార్ గౌడ్  చేసిన సీరియస్ వ్యాఖ్యలపై  మంత్రి సీతక్క స్పందించి వివరణ ఇచ్చుకున్నప్పటికి.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. 

ఇక కాంగ్రెస్ పార్టీలో మరో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బీసీ నినాదం బలంగా వినిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందని, వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి అవుతారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్  వివిధ సందర్భాల్లో చెబుతున్నారు.

అయితే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, పదేళ్లు తానే సీఎంగా ఉంటానని  స్వయంగా చెబుతున్న సందర్భాలున్నాయి.  ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం పదేళ్ల తర్వాత సీఎం సీటు కోసం ప్రయత్నం చేస్తానన్నారు.

పీసీసీ అధ్యక్షుడు వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తి సీఎం అవుతారని అంటుంటే.. మళ్లీ తానే సీఎం అవుతానని రేవంత్‌రెడ్డి చెప్పడంతో.. వీరిద్దరిలో ఎవరి మాట చెల్లుతుందనేది చర్చనీయాంశంగా మారింది. బీసీ కార్డుతో మహేశ్ పార్టీలో తన పెత్తనాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటే.. మి గతా వర్గాలు ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.