24-07-2025 10:33:00 PM
ఖమ్మం (విజయక్రాంతి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(Telangana Working Journalists Union) ఖమ్మం జిల్లా కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ మైసా పాపారావును గురువారం వైరాలో జరిగిన టియుడబ్ల్యుజె సభలో ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మైస పాపారావుకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. మైసా పాపారావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలను అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.