13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదు

14-01-2026 02:35 AM
  1. తలసాని బెదిరింపులకు ఎవ్వరు భయపడరు 
  2. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి 

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన అ నుచిత, బెదరింపు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్దమని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ రేఖ బోయలపల్లి మండిపడ్డారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవడానికి అవకా శం ఉంటుందని, కానీ బెదిరింపు దూషణలు చేయడం సరికాదని మంగళవారం ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు.

ఇలాంటి బెదిరింపులకు భయపడేవారు లేరనే విషయం గు ర్తుంచుకోవాలని ఆమె హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లు సమర్థవంతంగా అమ లు చేయాలంటే డీలిమిటేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని రేఖ బోయలపల్లి స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికా రత, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోందన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగుతుందనే విషయం తలసాని తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు.