09-06-2025 02:36:01 PM
మలేషియా: మలేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభయిందించి. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... ఉత్తర మలేషియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఒక విషాద ప్రమాదంలో విశ్వవిద్యాలయ విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి మినీవ్యాన్ను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెరాక్ రాష్ట్ర పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.
థాయ్ సరిహద్దుకు దగ్గరగా ప్రమాదాలకు గురయ్యే మార్గం తూర్పు-పశ్చిమ రహదారిపై గెరిక్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పెరాక్ రాష్ట్ర పోలీసు చీఫ్ హిసామ్ నార్డిన్ తెలిపారు. దశాబ్ద కాలంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం ఇదేనని నిర్ధారించారు. అగ్నిమాపక, రెస్క్యూ విభాగం షేర్ చేసిన ఫోటోలలో ఆకుపచ్చ విశ్వవిద్యాలయ బస్సు పక్కకు బోల్తా పడి, వెనుక భాగం మొత్తం నలిగిపోయింది. ఎర్ర మినీవ్యాన్ రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లడంతో దాని అద్దాలు పగిలిపోయాయి. కొంతమంది బాధితులు స్వయంగా బయటపడగా, మరికొందరు బస్సులోనే చిక్కుకున్నారని పెరాక్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. శిథిలాల లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు హైడ్రాలిక్ కట్టర్లను ఉపయోగించాయి. ఘటన స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.