09-06-2025 03:05:38 PM
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ఎస్ఐబీ (Special Intelligence Bureau) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Former T. Chief. Prabhakar Rao) సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరయ్యారు. 14 నెలల తర్వాత అమెరికా నుండి ఆదివారం రాత్రి హైదరాబాద్కు తిరిగి వచ్చిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (Retired Indian Police Service) అధికారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు(SIT Officials) ప్రభాకర్రావు స్టేట్మెంట్(Prabhakar Rao Statement) రికార్డ్ చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే మీరు విదేశాలకు ఎందుకు వెళ్లారు..?, హార్డ్డిస్క్లను ఎవరు ధ్వంసం చేశారు..?, మీ ఆదేశాలతోనే ప్రణీత్రావు హార్డ్డిస్క్లను ధ్వంసం చేశారా..? స్పెషల్ ఆపరేషన్ టీమ్ ను ఎవరు చెబితే ఏర్పాటు చేశారు..?, హార్డ్డిస్క్ల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది..?, శ్రవణ్రావుకు, ఎస్ఐబీతో సంబంధం ఏంటి..? అని సిట్ అధికారులు ప్రభాకర్ రావును వరుసగా ప్రశ్నించారు.
గత ఏడాది మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు గత భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలకు సంబంధించినది. తమ దర్యాప్తులో భాగంగా మాజీ ఎస్ఐబీ చీఫ్ నుండి కీలక సమాచారాన్ని సేకరించాలని సిట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులను విచారించినప్పుడు సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ ను ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐబీకి నాయకత్వం వహించిన ప్రభాకర్ రావును సిట్ పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించింది.
ఏడాది పాటు విచారణ నుంచి తప్పించుకున్నందుకు ప్రభాకర్ రావుపై హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు గత నెలలో ప్రొక్లరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభాకరరావు, ప్రత్యర్థి రాజకీయ నాయకులు, వారి కుటుంబాలు, అధికార పార్టీలోని అసమ్మతివాదులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులపై నిఘా పెట్టడానికి ప్రణీత్ రావుతో సహా తన విశ్వసనీయ సహాయకులతో ఎస్ఐబీలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఆరోపణలు గత ఏడాది మార్చిలో ఎస్ఐబీకి అదనపు ఎస్పీ డీ.రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రణీత్ రావు అరెస్టుతో వెలుగులోకి వచ్చాయి.