14 April, 2026 | 12:25 AM

సఫిల్‌గూడ చెరువులో దూకిన మల్కాజ్‌గిరి కార్పొరేటర్

20-11-2025 10:58 AM

హైదరాబాద్: మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్‌(Malkajgiri BJP Corporator) సఫిల్‌గూడ చెరువులో దూకాడు. గురువారం ఉదయం కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ చెరువులో దూకినట్లు సమాచారం. కార్పొరేటర్ ను సముదాయించిన స్థానికులు బయటకు తీసుకువచ్చారు. సఫిల్ గూడ చెరువులో అభివృద్ధి పనుల విషయంలో కార్పొరేటర్ మనస్తాపం చెందాడు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ఆరోపించారు.